బ్రహ్మోస్ క్షిపణి పరిధిలో పాక్ ప్రతి అంగుళం: ‘ఆపరేషన్ సిందూర్’ ట్రైలర్ మాత్రమేనన్న రాజ్ నాథ్ సింగ్!

పాకిస్థాన్ మంత్రులు ఇటీవల చేసిన కవ్వింపు వ్యాఖ్యలకు భారత రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్​లోని బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ యూనిట్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడ తయారైన బ్రహ్మోస్ క్షిపణుల మొదటి బ్యాచ్‌ను శనివారం ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్​నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఆపరేషన్‌ సిందూర్‌ కేవలం ట్రైలర్‌ మాత్రమే అని, పాక్ దుస్సాహసానికి పాల్పడితే ఊహించని ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.

“పాకిస్థాన్‌లోని ప్రతి అంగుళం భూమి ఇప్పుడు మన బ్రహ్మోస్ పరిధిలో ఉంది” అని రాజ్​నాథ్​ సింగ్ స్పష్టం చేశారు. బ్రహ్మోస్ క్షిపణి కేవలం ఆయుధం మాత్రమే కాదని, ఇది స్వదేశీ సామర్థ్యానికి చిహ్నం అని ఆయన అభివర్ణించారు. ఐదు నెలల్లోనే ఈ యూనిట్​లో క్షిపణులు తయారు చేయడంపై అభినందించారు. ఈ బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ సైన్యం, నావికాదళం, వైమానిక దళానికి వెన్నెముకగా ఉందని ఆయన పేర్కొన్నారు.

లక్నో సాంకేతికత, పరిశ్రమల నగరంగా మారిందని రాజ్​నాథ్​ సింగ్ ప్రశంసించారు. మే 11న ఏర్పాటు చేసిన కొత్త బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ జాతీయ భద్రత వైపు ఒక శక్తివంతమైన అడుగు అన్నారు. లక్నోలోని ఈ యూనిట్ ఏటా సుమారు 100 క్షిపణి వ్యవస్థలను ఉత్పత్తి చేయగలదని, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దాదాపు రూ. 3 వేల కోట్ల టర్నోవర్‌ చేస్తుందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. యూపీ పరివర్తనకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కారణమని ఆయన కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *