సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్: ‘అసుర ఆగమనం’ డైలాగ్‌తో మాస్ యాక్షన్ షో

మెగా హీరో సాయి దుర్గ తేజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘ఎస్‌.వై.జి’ (సంబరాల ఏటిగట్టు) సినిమా గ్లింప్స్ వీడియో విడుదలై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తేజ్ పుట్టినరోజు (అక్టోబర్ 15) సందర్భంగా విడుదలైన ఈ గ్లింప్స్ ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా ఆకట్టుకుంటోంది. రోహిత్ కె.పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు.

సాయి తేజ్ మాస్ లుక్, యాక్షన్ సన్నివేశాలు, పవర్ డైలాగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ‘అసుర సంధ్యవేళ మొదలైంది.. రాక్షసుల ఆగమనం’ అంటూ తేజ్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. అణచివేతకు గురవుతోన్న ప్రజల కోసం హీరో చేసే పోరాటమే ఈ కథ అని గ్లింప్స్‌ చూస్తుంటే అర్థమవుతోంది. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతి బాబు, సాయి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

గతంలో ‘గాంజా శంకర్’ సినిమా ఆగిపోయిన తర్వాత, ‘హనుమాన్’ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మాణంలో కేపీ రోహిత్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రకటించబడింది. బడ్జెట్ సమస్యలపై పుకార్లు వచ్చినా, తేజ్ 8 ప్యాక్‌తో ఉన్న పోస్టర్ రిలీజ్ చేసి మేకర్స్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా గ్లింప్స్‌తో అంచనాలు మరింత పెరిగాయి, సాయి తేజ్ మరో కెరీర్ హిట్ కొట్టబోతున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *