హైదరాబాద్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారిని ఘనంగా శాలువాతో సన్మానించిన న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు సత్యగ్రహ దీక్ష చేపట్టడం చరిత్ర గుర్తించదగ్గ అంశమని తెలియజేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్ కేటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తే రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ బిడ్డలు, బీసీ సంఘాల నాయకులు, సుమారు 144 కుల సంఘాల బిసి నాయకులు,రాజకీయ నేతలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో సత్యాగ్రహ దీక్ష చేపట్టడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.