ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో భూకంపం

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 5.56 గంటలకు మణిపూర్‌లోని ఉక్రుల్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 4.5గా నమోదయిందని నేషనల్ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది. ఉక్రల్‌కు 57 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *