మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రాజీనామా

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రాజీనామా చేశారు. మొత్తం మీద ఏడుగురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్, సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ రాజీనామా చేసినవారిలో ఉన్నారు.
అన్ని వర్గాలకు సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. కొత్త మంత్రివర్గంలో 13 మంది న్యాయవాదులు, 6గురు వైద్యులు, 5 గురు ఇంజనీర్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. పీహెచ్‌డీ, ఎంబీఏ వంటి ఉన్నత విద్యావంతులకు మోదీ ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తోంది. ముగ్గురు ఎస్టీలు, ఇద్దరు ఎస్సీలకు కేబినెట్ హోదా ఇవ్వబోతున్నట్లు సమాచారం. సహాయ మంత్రులు కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకూర్‌లకు పదోన్నతి లభిస్తుందని చెప్తున్నారు.

ప్రస్తుతం సహాయ మంత్రులుగా ఉన్న ఏడుగురికి పదోన్నతి లభించే అవకాశం ఉందని జాతీయ మీడియా చెప్తోంది. తెలుగు తేజం జి కిషన్ రెడ్డి కూడా ఈ జాబితాలో ఉన్నారని చెప్తున్నారు. ఎన్డీయే కూటమిలోని అప్నాదళ్ (ఎస్) నేత అనుప్రియ పటేల్‌కు మంత్రి పదవి లభించబోతున్నట్లు తెలుస్తోంది.

కొత్త మంత్రులు బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *