తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి, అంటే జూన్ 18వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రకటించింది.
పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 66 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతీరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కొనసాగుతుంది.