ఇటీవల జమ్ము వైమానిక స్థావరంపై ఇటీవల డ్రోన్ల దాడితో తీవ్ర ఉద్రిక్తత

ఇటీవల జమ్ము వైమానిక స్థావరంపై ఇటీవల డ్రోన్ల దాడితో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సమయంలో పాకిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద డ్రోన్‌ కదలికలు కలకలం సష్టిస్తున్నాయి. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ భవనంపై శుక్రవారం తెల్లవారుజామను డ్రోన్‌ సంచరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాయబార కార్యాలయం వద్ద డ్రోన్‌ సంచారం భద్రత ఉల్లంఘన చర్యగా అభివర్ణించింది. అంతర్జాతీయ సరిహద్దు దాటడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్‌ నిఘా డ్రోన్‌ను సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్‌) గుర్తించి, కాల్పులు ప్రారంభించింది. దీంతో ఈ డ్రోన్‌ వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. అర్నియా సెక్టార్‌లో శువ్రారం తెల్లవారుజామున 4.25 గంటలకు ఈ సంఘటన జరిగింది. బిఎస్‌ఎఫ్‌ పోస్ట్‌కు అతి సమీపంగా ఈ డ్రోన్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా, జమ్ములో ఎయిర్‌ బేస్‌పై డ్రోన్‌ దాడుల తరువాత ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండోసారి. అలాగే జమ్ములోని వివిధ ప్రాంతాల్లో సోమ, మంగళ, బుధవారం రాత్రి సమయాల్లో కీలకమైన ఆర్మీ స్థావరాలపై డ్రోన్లు కనిపించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *