రేవంత్ రెడ్డిని కలిసిన అభిజిత్ బెనర్జీ..! ఎందుకంటే..,?

ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ భేటీ మర్యాదపూర్వకంగా జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది.

 

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా త్వరలోనే ‘తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డు’ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ బోర్డులో భాగస్వాములు కావాలని అభిజిత్ బెనర్జీని ముఖ్యమంత్రి కోరారు. ఇందుకు అభిజిత్ బెనర్జీ సానుకూలంగా స్పందించారు.

 

ఈ సందర్భంగా, రాష్ట్ర ప్రగతికి దోహదపడే పలు సూచనలను అభిజిత్ బెనర్జీ ముఖ్యమంత్రికి అందించారు. ముఖ్యంగా, ఫ్యూచర్ సిటీ ప్రణాళికలో కళలు, చేతివృత్తులు, సృజనాత్మకతను అంతర్భాగం చేయాలని ఆయన సూచించారు. అంతేకాకుండా, సంప్రదాయ చేతివృత్తుల వారిని ఆధునిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వీలుగా ప్రత్యేక స్వల్పకాలిక కోర్సులను నిర్వహించాలని కూడా సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *